ఏన్కూరు: ఏన్కూరు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థి బాదావత్ నితిన్ అత్యంత ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రకటించిన ఎంసెట్లో 969 ర్యాంక్ సాధించాడు. నితిన్ మాట్లాడుతూ నీట్లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా నితిన్ను పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు వేము రాజు, నజీమాపర్వీన్, అస్రఫ్సుల్తానా, స్వప్న, శిల్ప తదితరులు పాల్గొన్నారు.