చింతకాని: గాంధేయ మార్గంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ అభివృద్ది, సంక్షేమం జరుగుతున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. దేశ చరిత్ర ఉన్నంతకాలం గాంధీ చరిత్ర ఉంటుందని తెలిపారు. చింతకాని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఆయన పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం చింతకాని గాంధీ సెంటర్లో, మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా పూలమాలతో నివాళి అర్పించారు. గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడని వారు కొనియాడారు.