ఖమ్మం: పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 612 కోట్లు విడుదల చేయడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదలను ఆదుకునే లక్ష్యంతో ఒకేధపా ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం సీఎం కేసీఆర్కు పేద ఆడపిల్లల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. కళ్యాణలక్ష్మి పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ. 1850 కోట్లు ప్రభుత్వం కెటాయించిన సంగతి తెలిసిందేనని మంత్రి అన్నారు.
ఇప్పటికే రెండు త్రైమాసికాలకు రూ. 925 కోట్లు విడుదల చేయడం జరిగిందని, తాజాగా మూడో త్రైమాసికానికి రూ. 463.50 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. షాదీముబారక్ పథకానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 300 కోట్లు కెటాయించి ఇప్పటికే రూ. 150 కోట్లు విడుదల చేసి, తాజాగా మిగిలిన రూ.150 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.