– ఖమ్మం రూరల్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఖమ్మం రూరల్, జూన్ 23 : రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండల కార్యాలయం ముందు రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. వానాకాలం రైతు భరోసా నిధులను ఒకే దఫాలో విడుదల చేయాలని, పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలన్నారు. అలాగే మార్కెట్లో నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయాలను అరికట్టాలన్నారు.
రూ.2 లక్షలకు పైబడిన వ్యవసాయ రుణాలను కూడా మాఫీ చేయాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఖమ్మం రూరల్ తాసీల్దార్ వినయేందర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు బానోతు రామకోటి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి శంకరయ్య, పాసంగుల చందర్రావు, ఏలూరి భాస్కరరావు, వెన్నం భాస్కరరావు, మామిడి సుదర్శన్ రెడ్డి, మండల నాయకులు మెడకంటి పెద వెంకటరెడ్డి, గణపరపు నాగయ్య, గూడా బాబురెడ్డి, శ్రీనివాసరెడ్డి, బొడ్డు ఉపేందర్, గంధం రవి, భూక్యా నాగరాజు, అబుబకర్ దస్తగిరి పాల్గొన్నారు.