సత్తుపల్లి :తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎమ్మెల్సీ తాతా మధు గెలుపునకు కారణం అని సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు భారీ విజయం సాధించడంతో ఖమ్మంలో మంగళవారం ఎమ్మెల్సీగా గెలుపొందిన తాతా మధు,ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలను నియోజకవర్గ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా టీఆర్ఎస్వైపే ఉన్నారని అనడానికి నిదర్శనమే ఈ ఎన్నిక అన్నారు.
తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు టీఆర్ఎస్దేనన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఎంపీపీలు దొడ్డా హైమావతి శంకర్రావు, బీరవల్లి రఘు, పగుట్ల వెంకటేశ్వరరావు, లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీలు కూసంపూడి రామారావు, కట్టా అజయ్బాబు, మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, చాంద్పాషా, వల్లభనేని పవన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.