ఎర్రుపాలెం:మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గౌరెడ్డి సీతారామిరెడ్డి(41) అనే రైతు తన పొలంలో వ్యవసాయ మోటారును ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సీతారామిరెడ్డి మృతదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులు అర్పించివరిలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మాజీఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, రైతుసమన్వయ సమితి కోఆర్డినేటర్ శీలం వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ శీలం రాధమ్మ, వెంకటరెడ్డి, శేషిరెడ్డి, సత్యనారాయణరెడ్డిలు ఉన్నారు.