ఖమ్మం: ది గాడ్ థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో150 మంది నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క కిట్ లో1800 రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ది గాడ్ థెరిస్సామహిళా మండలి ప్రెసిడెంట్ ఎస్కే ఖతీజా మాట్లాడుతూ… సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజు, సభ్యులు నాగలక్ష్మి, యశోద, శ్రీదేవీ, స్వర్ణ, మహాబూబీ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.