మామిళ్లగూడెం, ఫిబ్రవరి 20: రానున్న పార్లమెంట్ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందకు అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ ట్రైనర్లు కే.శ్రీరామ్, మదన్గోపాల్ సూచించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ‘ఎన్నికల విధులు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నిర్వహణ’ అనే అంశాలపై ఐడీవోసీలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ, అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. మాక్ పోలింగ్, పోలింగ్ సందర్భంలో సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు చేపట్టాల్సిన చర్యలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు అసెంబ్లీ సెగ్మెంట్ల కేంద్రాల్లో ఉంటాయని, రిసెప్షన్ కేం ద్రం కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు ఉంటుందని తెలిపారు. పోలైన ఈవీఎంల రవాణా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మాత్రమే చేపట్టాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక కలర్ కోడ్తో రవాణా సిబ్బందికి టీ షర్టులు ఇవ్వనున్నట్లు చెప్పారు. నిర్ణీత సమయంలోగా నివేదికను సమర్పించాలన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్బుక్ను పూర్తిగా చదవాలని, ఏ సమయంలో ఏం చేయాలనే విషయాలను తూ.చ తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి, వ్యవసాయ అధికారి విజయనిర్మల, తహసీల్దార్లు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.