టేకులపల్లి, మార్చి 13 : ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని డీఆర్డీవో విద్యాచందన అన్నారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్, గొల్లపల్లి గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను బుధవారం పరిశీలించిన ఆమె నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మొలకలు రాని బ్యాగ్లలో మళ్లీ గింజలు నాటాలన్నారు. ఎదుగుతున్న మొక్కలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆమె రికార్డులను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పిల్లలతో ముచ్చటించారు. తర్వాత ఉపాధ్యాయులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో రవీంద్రరావు, ఏపీవో కాలంగి శ్రీనివాస్, ఈసీ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శులు శ్వేత, పవిత్ర, ఉమామహేశ్, టీఏ ధనలక్ష్మి, భీముడు, ఎఫ్ఏ లకాన్, బాలాజీ తదితరులు ఉన్నారు.