ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన టూవీలర్ మెకానిక్ అక్బర్ గత నెలలో కరోనా తో మృతి చెందాడు. అతనికి ఆర్థికసాయం అందించేందుకు ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ అధ్యక్షులు వంగాల కొండలరావు మరికొంత మంది మెకానిక్ యూనియన్ సభ్యులు ముందుకొచ్చారు. వీరంతా కలిసి చందాలు వేసుకొని మృతుని కుటుంబ సభ్యులకు 38వేల రూపాయలు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలకు యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూవీలర్ మెకానిక్ ల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. టూవీలర్ మెకానిక్ లను అసంఘటిత కార్మికులుగా గుర్తించి వారికి బీమా వర్తింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హకీమ్, సయ్యద్ అలీ పాషా, శివరామకృష్ణ, నాగరాజు, రాము, ఖాజా, రామారావు, కృిష్ణా, వాహిద్, నర్సింహారావు, అన్వర్, నాగేశ్వరావు, సుభానీ తదితరులు పాల్గొన్నారు.