మధిరరూరల్, మే17 : నిరుపేద దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ మెండెం లలిత అన్నారు. రొంపిమల్ల గ్రామంలో దళితబంధు లబ్ధిదారులకు ట్రాలీ ఆటోలను మంగళవారం అందజేసి మాట్లాడారు.
దళితబంధుతో నిరుపేద దళితులకు ఎంతో మేలు జరుగుతున్నదని, రూపాయి పెట్టుబడి లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు తమ అకౌంట్లలో డబ్బులు ఎలా జమవుతున్నాయో, అదే విధంగా దళితబంధుతో దళితుల ఖాతాల్లోకి రూ.10 లక్షలు నేరుగా జమ అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ మదన్సాహేబ్, టీఆర్ఎస్ నాయకులు కల్యాణపు రమేశ్, గొల్లమందల మోహన్చైతన్య, గ్రామస్తులు పాల్గొన్నారు.