పెనుబల్లి, అక్టోబర్ 4 : దళితబంధు పథకం భవిష్యత్లో అందరి బంధువు అవుతుందని, గృహలక్ష్మి పథకంతో సొంతింటి కల నెరవేర్చి పేద మహిళలను గృహలక్ష్మిగా మార్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం వీ.ఎం.బంజర సప్తపది ఫంక్షన్ హాల్నందు 500 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు ఉత్తర్వులు, నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కేసీఆర్ క్రీడా కిట్లను అందించారు. అనంతరం వీ.ఎం.బంజర, రామచంద్రారావుబంజర, బయ్యన్నగూడెం, తుమ్మలపల్లి, పాతకుప్పెనగుంట్ల, కొత్తకుప్పెనగుంట్ల, మర్లకుంట, కే.ఎం.బంజర, కోండ్రుపాడు, సూరయ్యబంజర, అడవిమల్లెల గ్రామాల్లో సుమారు రూ.7.5కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు రాష్ర్ర్టానికే కాకుండా దేశానికి అవసరమన్నారు. యావత్ ప్రజానీకం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. పదేళ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి గొప్ప పథకాలను చేపట్టారన్నారు. మరో అడుగు ముందుకు వేసి గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేస్తున్నారన్నారు.
మోదీ వ్యాఖ్యలకు ఖండన
ఇన్నేళ్లు గడిచినా ఏమీ మాట్లాడని మోదీ నేడు ఎన్నికల కోసం సీఎం కేసీఆర్పై అవాకులు చవాకులు పేల్చడం సరికాదని ఎమ్మెల్యే సండ్ర ధ్వజమెత్తారు. కులం లేదు.. మతం లేదు.. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని చూసి ఓర్వలేక నిందలు మోపడం సరికాదని, గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయామా.. అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆర్డీవో చక్రవర్తి, ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, ఎంపీడీవో శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుడయ్య(కందిమల్ల వెంకటసత్యనారాయణ), బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి భూక్యా పంతులి, నీలాద్రి చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, పీఆర్ డీఈ నళినీమోహన్, జేఈ సాయి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, భూక్యా పంతులి, తేజావత్ తావునాయక్, వాసం రాణి, మామిడి మైసయ్య, అప్పారావు, తడికమళ్ల సీత, చీకటి రామారావు, లక్కినేని వినీల్, కొత్తగుండ్ల అప్పారావు, తాళ్లూరి శేఖర్రావు, గువ్వల వెంకటరెడ్డి, సూరపురెడ్డి నరసింహారెడ్డి, కాక సీతారాములు, ఆవిటి మారేశ్వరరావు, ఉపసర్పంచ్ దుర్గం కృష్ణవేణి, కర్నాటి వీరభద్రరెడ్డి, కొప్పుల గోవిందరావు, లగడపాటి శ్రీను, యలమర్తి వెంకటేశ్వరరావు, బండారుపల్లి నాగేశ్వరరావు, కీసర వెంకటేశ్వరరెడ్డి, తేళ్లూరి నాగేశ్వరరావు, వెంకీ, గోదా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సండ్రకు జైకొట్టిన లంకాసాగర్ ప్రజలు
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు లంకాసాగర్ ప్రజలు బుధవారం రాత్రి జైకొట్టారు. సండ్ర వెంటే మేము.. సండ్రకే మా ఓటు.. జై సండ్ర.. జైజై సండ్ర.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.