కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 18: కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని, అర్ధరాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన తాగునీటి వసతి లేదని, బయట నుంచి ఎక్కువ ధరకు ప్యూరిఫైడ్ నీరు తెచ్చుకుని తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ మెనూ అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం హాస్టల్ పాల్వంచలోని ఓ ప్రైవేటు భవనంలో కొనసాగుతుందని, వైద్యకళాశాలలో నిర్మిస్తున్న హాస్టల్ ఇప్పటికీ పునాదుల దశలోనే ఉందన్నారు. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.