ధరణి ఉంటేనే రైతులకు మేలు
ధరణి ఉంటేనే రైతులకు ఎంతో మేలు. పాత పద్ధతి అంటే మళ్లీ పట్వారీ వ్యవస్థ వచ్చిన్నట్లే. అప్పుడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. గత యాభై ఏండ్లలో రైతులు పడ్డ ఇబ్బందులను గమనించిన కేసీఆర్ సార్ ధరణిని తీసుకొచ్చారు. దాని ద్వారానే రైతుబంధు కూడా వస్తున్నది. మళ్లీ సారే రావాలి. కారు గుర్తుకే మా ఓటు.
గత తొమ్మిదేండ్ల నుంచి 24 గంటలపాటు ఉచితంగా పంటలకు త్రీ ఫేజ్ కరెంటు అందుతున్నది. పంటలకు పుష్కలంగా నీరు లభిస్తున్నది. రాత్రిళ్లు పొలం వద్దకు పోకుండనే మోటర్తో నీటిని పెట్టుకుంటున్నాము. మా బాధలు పోయినాయి. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటు ఇస్తదట. అప్పుడు పంటలు ఎండిపోవడం ఖాయం. కాంగ్రెస్కు అధికారం ఇస్తే అంధకారమే. మళ్లీ మా ఓటు కేసీఆర్ సారుకే వేస్తాం.
రైతుల ఇబ్బందులు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఆయన హయాంలో రైతుల ఇబ్బందులు తొలిగాయి. రైతులకు 24 గంటల కరెంటు ఉంటున్నది. రైతుబంధు వస్తున్నది. పంట పెట్టుబడులకు రైతుబంధు ఎంతగానో ఉపయోగపడుతున్నది. కరెంటు సరఫరా మంచిగా ఉండటం వల్ల పంటల సాగు బాగున్నది. మళ్లీ సీఎంగా కేసీఆర్ ఉండాలి. కాంగ్రెస్కు వస్తే రైతులకు ఇబ్బందులు తప్పవు. కేసీఆర్కే మా ఓటు.
మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ మాకొద్దు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంటుతో రైతులం హాయిగా ఉన్నాం అర్ధరాత్రి కరెంటు తిప్పలు తప్పాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కరెంటు వస్తదో తెలియక పడిగాపులు పడేవాళ్లం. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పాలన వద్దు. వాళ్లు ఇచ్చే మూడు గంటల కరెంటు వద్దు. నా ఓటు కేసీఆర్ పార్టీకే. రైతులందరూ కూడా కేసీఆర్ పాలన కావాలని అనుకుంటున్నరు.
రైతును రాజు చేసింది కేసీఆరే. రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చారు. గతంలో రెండు ఎకరాలు సాగు చేసుకునేవాడిని. ఇప్పుడు వంద ఎకరాలలో కొబ్బరి, కోకో, పామాయిల్ సాగు చేసుకుంటున్నా. కేసీఆర్ సారుకు నా కుబుంబం రుణపడి ఉంది. నాకున్న ఐదు ఎకరాలకు పాస్ బుక్కులు ఇచ్చారు. రైతును ఉన్నత స్థితికి తీసుకొచ్చిన కేసీఆర్ పార్టీకి మా ఓట్లతోపాటు మరో వంద ఓట్లు వేయిస్తా.
ప్రభుత్వ పథకాలు మంచిగానే అందాయి. కేసీఆర్ వచ్చాక 24 గంటలు కరెంటు ఇచ్చారు. ఎప్పుడంటే అప్పుడు మోటర్ వేసుకుంటున్నం. గతంలో కరెంటు ఒక గంట ఉంటే.. మరో గంట ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పథకాలు మంచిగున్నప్పుడు ఇంకేం కావాలి..? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. ఆయన్నే గెలిపిస్తాం. రైతులందరం కేసీఆర్కే ఓటేస్తాం.
గతంలో భూమి వివరాలు, పట్టాలు పొందాలంటే చేతులు తడపాల్సిందే. అయినా పనులు కాకపోయేవి. భూమి హద్దులు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర వాటికి భద్రత ఉండేదికాదు. ఎవరు ఎప్పుడు తమ పేర రాయించుకుంటారోనని భయంగా ఉండేది. మార్పులు చేయడం దళారులకు పెట్టిన విద్యగా మారింది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి రైతన్నలకు భూమి పై శాశ్వత హక్కు కల్పించేందుకు ధరణిని ప్రవేశపెట్టారు. నేడు ఎంతో గర్వంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఎవరికి భయపడాల్సిన పనిలేదు. మా భూమి మాపేర ఉంది. అది చాలు మాకు. భూ తల్లిని నమ్ముకుని బతికే రైతన్నలకు ధరణి ఒక ఆయుధం. దళారుల రాజ్యం పోయింది.
గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ సక్రమంగా రాక అనేక ఇబ్బందులు పడ్డాం. కరెంట్ కోసం బోరు బావుల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాసినం. కరెంట్ కటింగ్తో.. నోటికాడికి వచ్చిన పంట ఎండిపోయేది. లోఓల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు పడితే అప్పుడు కాలిపోయేవి. ఆ కరెంటు కష్టాలు ఇంకా గుర్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందుతున్నది. రెండు పంటలు పుష్కలంగా పండించుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఓటేస్తాం.
కాగ్రెస్ నాయకులు ధరణి రద్దు చేస్తామంటున్నారు. ధరణి లేకపోతే దళారులు రాజ్యమేలతారు. లంచాలు, ఫైరవీలు, దళారీ వ్యవస్థ.. కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పదేండ్ల తెలంగాణ నాశనమవుతుంది. మళ్లీ పాత రోజులు దాపురిస్తాయి. ధరణితో రైతుల భూములు భద్రంగా ఉన్నాయి. ధరణిని రద్దు చేస్తే.. రైతుల భూములు ఆగమవుతాయి. మాకు కాంగ్రెస్ వద్దు, అది తెస్తానంటున్న దళారుల రాజ్యం వద్దు. మాకు కేసీఆర్ సారే కావాలి, మళ్లీ ఆయనే రావాలి. ధరణి ఉండాలి.
ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ధరణి పోర్టల్ రద్దు చేస్తే పూర్వకాలం నాటి పైరవీల రాజ్యం వస్తుంది. దళారుల ప్రమేయం పెరుగుతుంది. రైతుల భూములు గోల్మాల్ అవుతాయి. రైతుల మధ్య అగాధం పెంచేందుకు కాంగ్రెస్ వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ధరణి పోతే రోజులతరబడి అధికారుల చుట్టూ, లీడర్ల చుట్టూ తిరగాలి. భూ సమస్య లేకుండా ఉండాలంటే ధరణి ఉండాల్సిందే. మేమంతా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ను గెలిపిస్తాం.
సీఎం కేసీఆర్ దయ వల్ల రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూ యజమాని, కౌలుదారుల మధ్య గొడవలు వస్తాయి. రైతుబంధు కౌలు రైతులకు ఇస్తే భూయజమానికి ఇవ్వరంట. భూయజమానికి ఇస్తే కౌలు రైతులకు ఇవ్వరంట. ఇదేమి పద్ధతి? కాంగ్రెస్ హామీలను మేం నమ్మం, మోసపోము. పూటకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ను రానివ్వం.
రైతుల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడతారు. గత ప్రభుత్వాల హయాంలో ఎవరూ రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా అమలుచేస్తూ వ్యవసాయరంగాన్ని దేశంలోనే నెంబర్వన్గా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ హయాంలో రైతులు కరెంటు లేక చీకటిరోజులు గడిపారు. పొలాల వద్ద పడిగాపులు పడ్డారు. పంటలు పండక అగచాట్లు పడి అప్పుల పాలయ్యారు. కాంగ్రెస్ మూడు గంటలు కరెంటు చాలనడం వారి అవివేకానికి నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వంలోనే రైతు రాజయ్యాడు. కేసీఆరే మళ్లీ రావాలి.. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది.
అన్నదాతలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కష్టాలు, చీకటి రోజులు తప్పవు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియకపోయేది. రాత్రింబవళ్లు పొలం గట్ల వద్ద పడిగాపులు పడ్డాం. కాంగ్రెస్ వస్తే మూడు గంటలే కరెంటు ఇస్తరట. వాళ్లకు అసలు వ్యవసాయం గురించి తెలుసా? యజమానికి రైతుబంధు ఇస్తే కౌలు రైతుకు ఉండదట. కౌలు రైతుకిస్తే యజమానికి ఉండదట. ఇదెక్కడి పద్ధతి..? కాంగ్రెస్ను నమ్మితే.. రైతులు నట్టేట మునిగినట్లే. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులు రాజు అయ్యారు. 24 గంటల కరెంటుతో పంటలకు పుష్కలంగా నీరందుతున్నది. పంట దిగుబడులు బాగున్నాయి. రైతుబంధు వస్తున్నది. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న కేసీఆర్కే నా మద్ధతు. మాకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి.
24 గంటలు కరెంటు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కే ఓటు వేస్తాం. ఏడాదికి రెండు పంటలు పండించుకోవాలంటే 24 గంటల కరెంటు కావాలి. కాంగ్రెస్ నాయకులు పూటకో మాట చెబుతూ పరేషాన్ చేస్తున్నారు. రైతులకు కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటే కావాలి. మూడు గంటల కరెంటు వద్దు. కాంగ్రెస్ గెలిచిన రాష్ర్టాలలో రైతుల బాయిల వద్ద మీటర్లు పెడుతున్నారు. ఇక 10 హెచ్పీ మోటర్లు పెడితే బోర్లు ఎండిపోతాయి. కేసీఆర్ నాయకత్వంలోనే పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నాం. ధరణిని తీసేసి, అధికారుల కడుపు నింపే భూమాత తెస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతాం. పార్టీకి ఓటు వేసి, కోరి కష్టాలు తెచ్చుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. భూమాత వద్దు, మూడు గంటల కరెంటు వద్దు. అసలు కాంగ్రెస్సే వద్దు.
కాంగ్రెస్ పాలనలో రైతులంతా అరిగోస పడ్డరు. ఎన్నికలు వచ్చినపుడే కాంగ్రెస్కు రైతులు గుర్తొస్తరు. మళ్లోసారి కాంగ్రెస్ రైతులను మోసం చేయడానికి చూస్తున్నది. కాంగ్రెస్ చెప్తున్న మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా తడవదు. 10 హెచ్పీ మోటర్లను రైతులు పెట్టుకోలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 24 గంటల వ్యవసాయ విద్యుత్తుతో రైతులమంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు పండించుకుంటున్నం. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఆరు గ్యారంటీల్లో భరోసా కనిపించడం లేదు. అడ్డగోలు హామీలతో మ్యానిఫెస్టో ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినట్లు చేస్తారు. 24 గంటల కరెంటు వృధా అని నోరు పారేసుకున్న రేవంత్రెడ్డిని రైతులంతా చెంప పెట్టులా ఓడిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ10 వేలు ఇస్తున్నది. మూడోసారి అధికారంలోకి వచ్చినాక ఈ మొత్తాన్ని రూ.16వేలకు పెంచుతానన్నది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్నే గెలిపిస్తం.