ఫలితంగా కేసుల్లో మరింత పురోగతి సాధ్యమవుతుంది
నేర సమీక్ష వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్రెడ్డి
మామిళ్లగూడెం, జూన్ 25: కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో సందేహలుంటే ఇన్వెస్టిగేషన్ సెంటర్ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్లలో ఏకీకృత సేవలను విస్తరింపజేసేందుకు ప్రవేశ పెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ అమలు తీరును పరిశీలించారు. ఖమ్మం నుంచి సీపీ విష్ణు ఎస్ వారియర్, ఏడీసీపీలు శబరీశ్, సుభాశ్ చంద్రబోస్, కుమారస్వామి, ఏసీపీలు సాధన రష్మీ పెరుమాళ్, రామోజీ రమేశ్, ప్రసన్నకుమార్, వెంకటస్వామి, ఆంజనేయులు, బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.