ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గ పరిధిలోని రామన్నపేటలో ఉన్న జిల్లా జైలును ఆదివారం డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజెన్స్ కరెక్షనల్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా డీజీకి జైలు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం డీజీ సౌమ్య మిశ్రా జైల్లో ఉన్న ఖైదీలతో ముఖాముఖిగా ముచ్చటించారు. ఖైదీల బాగోగులను విచారించి వారికి జైల్లో అందాల్సిన సదుపాయాలు ఆహారం, వైద్యం న్యాయ సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఖైదీలకు కేటాయించిన లైబ్రరీ సందర్శించారు. ముద్దాయిలకు సంబంధించిన కిచెన్ వైద్యశాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. జైలు లోపల ఉన్న స్టీల్, ఫినాయిల్ ఫ్యాక్టరీలను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తులను పెంచడానికి అవసరమైన సూచనలు సిబ్బందికి అందించారు. ఖైదీల మనోవికాసం వారి ఆరోగ్యరీత్యా జైళ్ల శాఖ చేపట్టిన స్పోర్ట్స్ మీట్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజెన్స్ సంపత్, ఖమ్మం జిల్లా జైలు పర్యవేక్షకుడు ఏ శ్రీధర్, ఇతర జైలు అధికారులు పాల్గొన్నారు.