ముదిగొండ, సెప్టెంబర్ 16: రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం క్షీరాభిషేకం చేసి, పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత పేరును సచివాలయానికి పెట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ సామినేని హరిప్రసాద్, నాయకులు మందరపు ఎర్ర వెంకన్న, బంక మల్లయ్య, చెరుకుపల్లి బిక్షం, నాగార్జున, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 16: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని హర్షిస్తూ స్థానిక దళిత ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ దేవరకొండ శిరీష, ఎంపీటీసీ సభ్యులు సగ్గుర్తి కిషోర్బాబు, షేక్ మస్తాన్వలి, పెద్దగోపవరం సర్పంచ్ ఇనుపనూరి శివాజీ, ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, నాయకులు ఇనుపనూరి భాస్కర్, బుర్ర నారాయణరావు, చిన్నం రాము, దేవరకొండ రవి, షేక్ హుస్సేన్, సరోజిని, దేవరకొండ చిరంజీవి, నల్లమోతుల దానయ్య, వేల్సూర్ వెంకటేశ్వరరావు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, కలపాల ప్రవీణ్ పాల్గొన్నారు.
పాల్వంచ, సెప్టెంబర్ 16: స్థానిక అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ మాలమహానాడు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొట్టే రవితేజ, పెంకి శ్రీనివాసరావు, నామ ప్రసాద్, బండి వెంకటేశ్వర్లు, గుర్రం వెంకటేశ్వర్లు, గడ్డం వెంకటనారాయణ, అశోక్, జస్వంత్, అనూప్, నవీన్, భరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సింగరేణి ఎస్సీ లైజన్ ఆఫీసర్ కలవల చంద్రశేఖర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కూరపాటి రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. వారు ‘నమస్తే’తో మాట్లాడుతూ.. నూతన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న సీఎం నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 16: స్థానిక పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మాదిగ జాక్ ప్రధాన కార్యదర్శి మోదుగు జోగారావు క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఓదెల శంకర్, గద్దల రమేష్, బీమ్రాజ్, కాశిమల్ల రమేష్, నల్లగట్ల వెంకన్న, ప్రవీణ్కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.
రామవరం, సెప్టెంబర్ 16 : నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం అభినందనీయమని రామవరం మాదిగ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. రామవరంలోని ఆ సంఘం కార్యాలయంలో వారు మాట్లాడుతూ కులం, మతం, పేద, ధనిక తారతమ్యం లేకుండా రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని ప్రసాదించిన మహనీయుడి పేరు పెట్టడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంలో మోదీ కూడా పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. కొయ్యడ వెంకటేశ్వర్లు, సంజీవరావు, మాధవరావు, నర్సయ్య, ఎల్లయ్య, మధుబాబు, గణేశ్, శ్రీనివాస్, నాధయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.