చింతకాని, జనవరి 28: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ప్రవేశపెట్టి దళిత బాంధవుడిలా నిలిచారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. శనివారం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో దళితబంధు యూనిట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో కలెక్టర్ పర్యవేక్షణలో పథకం అత్యంత పారదర్శకంగా 26 గ్రామాల్లో అమలైందన్నారు. దళితబంధు ఇచ్చేది సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఒక్క కుటుంబం కూడా నష్టపోకుండా 100 శాతం దళితబంధు అమలైన మండలంగా చింతకాని రికార్డులకు ఎక్కిందని చెప్పారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులను పలకరించారు. నాగులవంచ గ్రామంలో జేసీబీ ఓనర్ కోల్లి బాబు మాట్లాడుతూ దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. పడిశాల జయేంద్ర మాట్లాడుతూ తమ కుటుంబానికి వచ్చిన డైయిరీ యూనిట్ ద్వారా రోజుకు రూ.1000 పైగానే సంపాదిస్తున్నామని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ సార్ సల్లగుండాలే అని మరో లబ్ధిదారురాలు పరిటాల మౌనిక పేర్కొన్నారు. ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి వెంకటలచ్చయ్య, మంకెన రమేశ్, బోడ్డు వెంకట్రామయ్య, గడ్డం శ్రీను, చాట్ల సురేశ్, భగవాన్, కొల్లి బాబు, బండి రామారావు, పిన్నెల్లి శ్రీను, శేషగిరి పాల్గొన్నారు.
జమలాపురం ఆలయంలో పూజలు
ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రత్యేక పూజలు చేశారు.