రఘునాథపాలెం, డిసెంబర్ 25: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు, హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంటు ప్రాజెక్టులను ఒకచోటకు చేర్చి క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో సోమవారం ముగిసింది. ముగింపు సభకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఖమ్మంలో ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘క్రెడాయ్’ చక్కటి వేదికను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా, జిల్లా ప్రజలకు ఈ అవకాశం కల్పించినందుకు సంస్థ అధ్యక్షుడు బండి జయకిశోర్ను అభినందించారు. ప్రాపర్టీ షోలో భాగంగా బంపర్ డ్రా విజేతకు బహుమతులను ప్రదానం చేశారు. ముందుగా ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
ఖమ్మంతోపాటు హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు, వివిధ బ్యాంకులు 70 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సెలవురోజు కూడా కావడంతో వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఔత్సాహికులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాల గ్రౌండ్లోని వేదిక హాల్ కిక్కిరిసిపోయింది. రెండోరోజు సైతం ప్రతి గంట గంటకూ డ్రా తీసి విజేతలకు బహుమతులను అందజేశారు. క్రెడాయ్ జిల్లా అధ్యక్షుడు బండి జయకిశోర్, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్ది కేశవరావు, కోశాధికారి చెరుకుమల్లి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు వేజెళ్ల సురేశ్, కొప్పు నరేశ్, నగర అధ్యక్షుడు తుంపాల కృష్ణమోహన్, పగడాల రంగారావు, వీరయ్యచౌదరి, మల్లెల శ్రీనివాస్, కిశోర్కుమార్, వేములపల్లి నగేశ్, కొదుమూరి ఉమేశ్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావీద్, చావా నారాయణరావు, రావూరి సైదుబాబు, కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు.