ఖమ్మం :వీ.యం.బంజర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఇటీవల మరణించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ నుంచి మంజూరైన రూ.5 లక్షల రూపాయల చెక్కును పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ మృతుని భార్య నాగంజలికి అందజేశారు. ఈ సందర్భంగా శాఖ పరంగా అందవలసిన బెన్ఫిట్స్ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.