యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మంచి ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని అభివర్ణించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో క్రీడా, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో ప్రజ్ఞా భారతి సంస్థ సహకారంతో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో యోగా అంటే ఇండియా అని, ఇండియా అంటే యోగా అనే భావన వచ్చిందన్నారు.
యోగా మన వారసత్వ సంపద అని అన్నారు. ఈ సందర్భంగా అక్కడి వచ్చిన వారితోపాటు కలెక్టర్ కూడా యోగా చేశారు. యోగాలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన సతీశ్, చినబాబులను కలెక్టర్ అభినందించారు. కాగా, ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని విద్యాసంస్థల్లోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కోర్టులో జిల్లా జడ్జి బీఎస్ జగ్జీవన్కుమార్ కూడా యోగా డేలో పాల్గొన్నారు.
-ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్/ ఖమ్మం లీగల్/ రఘునాథపాలెం, జూన్ 21