అన్నపురెడ్డిపల్లి, జనవరి 21 : తప్పులులేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, సవరణలపై బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
18 ఏండ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా చూడాలని, ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులను చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, ఆర్ఐ మధు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.