వేంసూరు, జనవరి 12 : సీఎం కేసీఆర్ దేశానికి రోల్మోడల్గా నిలుస్తున్నారని, ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం భారీ బహిరంగసభ జరుగుతుందని, పలువురు సీఎంలు హాజరవుతున్నారని, సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పగుట్ల వెంకటేశ్వరరావు, పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీను, మందపాటి మహేశ్వర రెడ్డి, గొర్ల శ్రీనివాసరెడ్డి, ఉప్పలపాటి కృష్ణయ్య, సుబ్బయ్య, ఎండీ. ఫైజుద్దీన్, యర్రా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు, జనవరి 12 : ఈ నెల 18న ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయవంతానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గ్రామాల్లో బీఆర్ఎస్ మండల నాయకులు గురువారం ప్రచారం నిర్వహించారు. మండల నాయకులు మాట్లాడుతూ బహిరంగ సభను ఇంటి పండుగలా భావించి ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభ చరిత్రలో నిలిచేలా మనమంతా భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు బీరవల్లి రఘు, కట్టా అజయ్బాబు, పాలెపు రామారావు, బోబోలు లక్ష్మణరావు, ఇస్మాయిల్, కొరకొప్పు ప్రసాద్, మేకల కృష్ణ, అజ్మీరా జమలయ్య, గంగవరపు శ్రీనివాసరావు, గొల్లమందల ప్రసాద్, బైరెడ్డి నర్సింహారెడ్డి, వల్లభనేని శ్రీనివాసరావు, బానోత్ మణిరాందాస్, పలు గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.