మధిర: మధిర ఎమ్మెల్యే మల్లు భట్టీవిక్రమార్క చొరవతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తొర్లపాడు గ్రామానికి చెందిన డీ.యశోదకు రూ.11,500, నిధానపురం గ్రామానికి చెందిన వీ.నాగేశ్వరరావుకు రూ.32,500 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దారా బాలరాజు, అద్దంకి రవికుమార్,సైదల్లిపురం సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు, షేక్ జహంగీర్, బిట్ర ఉద్దండయ్య, కర్నాటి రామారావు, ఆదిమూలం శ్రీనినివాసరావు, వెంపటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.