ఖమ్మం: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్న హస్తం అందిస్తోందని డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం అన్నారు. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సిఎంఆర్ఎఫ్ ద్వారా నిరుపేదలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని నామ క్యాంప్ కార్యాలయంలో 26 మంది లబ్దిదారులకు మంజూరైన 14 లక్షల 66వేల 500 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ సంఘం నాయకులు వీర్ల వరప్రసాద్, జిల్లా టిఆర్ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ, నాయకులు చిత్తారు సింహాద్రియాదవ్, బాణాల వెంకటేశ్వర్లు, ఉప్పనూతన నాగేశ్వరరావు, మద్దినేని రఘు, ఇమామ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.