చింతకాని: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిదని ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండలపరిధిలో జగన్నాథపురం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ కోలేటి సూర్యప్రకాశ్ గృహంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖామాత్యులు పువ్వాడ అజయ్కుమార్ సిఫారసు మేరకు రూ.2.43లక్షల విలువైన ఆరు చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, స్వరాష్ట్రంలో అభివృద్ది సాధ్యమైందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆలస్యం నాగయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, కార్యదర్శి బోడ్డు వెంకట్రామారావు, సోసైటీ చైర్మన్లు కోండపల్లి శేఖర్రెడ్డి, నల్లమోతు శేషగిరిరావు, రైతుబంధునాయకులు కిలారు మనోహర్బాబు, వంకాయలపాటి సత్యనారాయణ, నూతలపాటి వెంకటేశ్వర్లు, బండి సుభద్ర, పర్చగాని లక్ష్మణ్, కోలేటి రాధాకృష్ణ, నారపోగు నాగయ్య, పిన్నెల్లి శ్రీను, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.