ఖమ్మం, నవంబర్ 1: తుమ్మల నాగేశ్వరరావు కంటే రంగులు మార్చే ఊసరవెల్లి నయమని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం మమత ఆడిటోరియంలో జరిగిన బీఆర్ఎస్ యువజన కమిటీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏండ్లలో నీచమైన రాజకీయాలు చేశారని, ఆయన ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదని అన్నారు. ఎక్కడా ఆప్షన్ లేకపోయేసరికి ఖమ్మం వచ్చాడని, ఖమ్మం ప్రజలపై ప్రేమ ఉండి కాదని అన్నారు. 2014లో తనపై ఓడిపోయిన తరువాత ఈ పది సంవత్సరాలు తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడికి పోయాడని, ఖమ్మం ప్రజల గురించి ఏమైనా పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో, వరదల సమయంలో తుమ్మల ఎక్కడ దాక్కున్నాడని అన్నారు. 50 సంవత్సరాలుగా పువ్వాడ కుటుంబం ఖమ్మం ప్రజలతోనే ఉన్నదని, నా తండ్రి నాగేశ్వరరావు రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారని, గెలిచినా, ఓడినా ఖమ్మం వదిలి పెట్టలేదన్నారు. తుమ్మల ఓల్డ్ వెస్పా స్కూటర్ లాంటి వారని, తాను స్పోర్ట్స్ బైక్ లాంటి వాడినని అన్నారు. తుమ్మల 40 ఏండ్లలో ఖమ్మంకు ఏమి చేశారో చెప్పాలని, తాను మంత్రిగా ఉన్న నాలుగేండ్లలోనే ఖమ్మం ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. తన వెంట ఉన్నది నికార్సయిన యువకులు అని, తుమ్మల వెంట ఉన్నది రౌటీషీటర్లు, గంజాయి స్మగ్లర్లు అని అన్నారు. నేను పక్కా లోకల్ అని, తుమ్మల ఇక్కడ లోకల్ కాదని, గండుగలపల్లినో, హైదరాబాద్నో వెల్తాడే తప్ప ఖమ్మంలో ఉండడని అన్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను, తనను హ్యాట్రిక్గా గెలిపించేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పువ్వాడ తనయుడు డాక్టర్ నయన్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా కిరణ్, పారా ఉదయ్, మాటేటి కిరణ్, బలుసుమురళి కృష్ణ, సాయి, గోపి సందేశ్ పాల్గొన్నారు.
ఖమ్మం, నవంబర్ 1: ఖమ్మం నగరంలోని 28వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ప్రకాష్నగర్లో 30 కుటుంబాల వారు బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి బుధవారం మంత్రి పువ్వాడ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి నిరోధకులను ఎన్నికల్లో ఒడిస్తామని, బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే నేడు ప్రజలు, కార్మికులు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. పార్టీలో చేరిన వారిలో విద్యాసాగర్, పాషా, నరసింహాలు, మురళి, రమణ మేస్త్రి, అంజిబాబు, సుమన్, చిరంజీవి, నరసింహారావు, ఉపేందర్, ఉమా మహేశ్, వెంకటేశ్వర్లు, వీరేష్, బిబ్లా, వెంకన్నకు స్వాగతం పలికారు. డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, నాయకులు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ లక్ష్మీ, నాగరాజు, నరసింహారావు, రఘు, లింగయ్య, శ్రీశైలం, వెంకన్నగౌడ్, కొండయ్య, యర్రా అప్పారావు, పాపారావు, వీరభద్రం ఉన్నారు.