సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 29: కల్లూరులో వచ్చే నెల 1న జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయలు తీసుకువచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు.
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోనూ ప్రజలకు వివరించాలని సూచించారు. ఇప్పటికే పార్టీ బూత్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి సభకు భారగా ప్రజలకు తరలించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, కంటే నాగమణి, వల్లభనేని పవన్, చాంద్పాషా, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రఫీ, కార్యదర్శి మల్లూరు అంకమరాజు, నాయకులు చల్లగుళ్ల కృష్ణయ్య, నర్సింహారెడ్డి, రంగారావు, మాధురి మధు పాల్గొన్నారు.