ఖమ్మం, ఆగస్టు 1: ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ ప్రభుత్వం సాకారం చేసిందని బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల వచ్చిన మున్నేరు వరదను స్వయంగా గమనించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమస్యను సీఎం కేసీఆర్కు వివరించారని అన్నారు. దీంతో ఆయన మున్నేరు పరీవాహకంలో రెండు వైపులా ఆర్సీసీ వాల్ నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఆర్సీసీ వాల్ నిర్మాణానికి ఇటీవలి క్యాబినెట్లో కూడా ఆమోదం లభించడం సంతోషదాయకమని అన్నారు. వాల్ నిర్మాణానికి మంత్రి అజయ్ నిధులు మంజూరు చేయించినందుకు, సీఎం కేసీఆర్ ఆమోదించింనందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం మున్నేరులోని బతుకమ్మ ఘాట్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రి అజయ్ ఫ్లెక్సీలకు మంగళవారం క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా డీసీసీబీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. వాల్ నిర్మాణం పూర్తయితే పరీవాహక ప్రజలకు వరద ముప్పు నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు. మంత్రి పీఏ రవికిరణ్, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు ఆర్జేసీ కృష్ణ, మాటేటి అరుణ, తోట గోవిందమ్మ, కన్నం వైష్ణవి ప్రసన్నకృష్ణ, మాటేటి కిరణ్కుమార్, ఫాతిమా, రామ్మోహన్రావు, సరస్వతి, లక్ష్మి, కమల, ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, ఎర్ర అప్పారావు, వెంకన్న, ముక్తార్, తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, రవినాయక్, కనకం భద్రయ్య, భాస్కర్, తన్నీరు శోభారాణి, కొల్లు పద్మ, తాజుద్దీన్, షమీన్, చిన్న మల్లేశం, జానీ, షకీనా, ప్రసాద్ పాల్గొన్నారు.
యువజన విభాగం ఆధ్వర్యంలో..
మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ వాల్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం త్రీటౌన్ అధ్యక్షుడు మాటేటి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి అజయ్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. నామరపు ఈశ్వర్, శంషుద్దీన్, యాకుబ్పాషా, ఉమ్మినేని శ్రీను, వీర, పాషా, ఉపేందర్, రాఘవరపు ప్రసాద్ పాల్గొన్నారు