గుండెల నిండా అభిమానంతో గులాబీ జెండాలు చేబూని.. మెడలో కండువా ధరించి సభకు బైలెల్లారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణం నిండు కొండలా మారింది. మంగళవారం మధిరలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జన జాతరను తలపించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న ప్రజలు అభిమానంతో చప్పట్లు, కేరింతలు కొట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.