కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంతోపాటు భావితరాలకు బంగారు భవిష్యత్ని అందించేందుకు ఆయుధమై కదిలారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి రాజకీయ యవనికపై సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు హాజరై సందడి చేశారు.
– నమస్తే నెట్వర్క్
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బుధవారం అట్టహాసంగా జరిగిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, నాయకులు పాలెపు రామారావు, సాయి మహేశ్వరం, వట్టం రాంబాబు, ప్రజాప్రతినిధులు కట్టా అజయ్బాబు, బీరవల్లి రఘు పాల్గొన్నారు.
– సత్తుపల్లి/ పాల్వంచ/ మణుగూరు టౌన్/ కల్లూరు, డిసెంబర్ 14