ఖమ్మం, ఆగస్టు 23: మొట్టమొదటగా వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించింది తెలంగాణ ప్రభుత్వమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, అన్ని వర్గాలను ఆదుకున్న మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసి మాట్లాడారు.
మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దివ్యాంగులకు మరింత చేయూతనందించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచిన ఘన సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇంత పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పైగా తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పింఛన్ ఇస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణలో ఆసరా పింఛన్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల కోట్లు వెచ్చిస్తోందని గుర్తుచేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించింది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. పింఛన్ల పథకానికి ఆసరా అని నామకరణం చేసిన ఘనత మంత్రి కేటీఆర్దేనని అన్నారు. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బోధకాలు బాధితులు, ఎయిడ్స్ రోగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోందని అన్నారు. మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ను రూ.4016కు పెంచారని గుర్తుచేశారు. దీంతో తో ఖమ్మం నియోజకవర్గంలో 5522 మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుందని, వారికి ప్రతి నెలా రూ.2.18 కోట్ల మేర పింఛన్లు అందనున్నాయని వివరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,91,691 మందికి ఆసరా పింఛన్ల కింద ప్రతి నెలా రూ.44. 48 కోట్లు అందిస్తున్నామని, వీరిలో 28,966 మంది దివ్యాంగులకు ఇక నుంచి రూ.4016 చొప్పున ప్రతి నెలా రూ.11.51 కోట్లు అందిస్తామని వివరించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కొండబాల కోటేశ్వరరావు, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, ఆదర్శ్ సురభి, విద్యాచందన, సుమ, ఫాతిమా, గౌరీ, ప్రియాంక, కర్నాటి కృష్ణ, మక్బుల్, దాదె అమృతమ్మ, పగడాల నాగరాజు పాల్గొన్నారు.