ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీవో నెంబర్ 44 ద్వారా హెచ్ఆర్ పాలసీని అమలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకు వారంతా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞత చాటుకున్నారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల రమేశ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సురేశ్, వరంగల్ జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ రమణాచారి, తెలంగాణ కార్మిక బిభాగం రాష్ట్ర కార్యదర్శి కాసాని నాగేశ్వరరావు మాట్లాడుతూ హెచ్ఆర్ పాలసీని అమలు చేయడానికి జీవోను జారీ చేయడం సంతోషదాయమని అన్నారు. సంఘం నేత మట్ట అంజయ్య తదితరులు పాల్గొన్నారు.