దుమ్ముగూడెం, ఫిబ్రవరి 26 : మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. కొత్త దంతెనం పంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి తాలిపేరు కెనాల్ వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో 900 మీటర్ల గ్రావెల్ రోడ్డు, సీడీపీ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఆయన కొబ్బరికాయ ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షులు తునికి కామేశ్, అపకా వీర్రాజు, సొసైటీ డైరెక్టర్ కాలువ పూర్ణయ్య, సోషల్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు దామెర్ల శ్రీనివాసరావు, తోట రమేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోతుకూరి శ్రీకాంత్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు కొత్తా మల్లేశ్వరరావు, బీసీ సెల్ కార్యదర్శి బొల్లి శేఖర్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు పొడియం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.