సత్తుపల్లి/ కల్లూరు/ పెనుబల్లి /కారేపల్లి / కామేపల్లి, వేంసూరు, మే 16 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సోమవారం సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది డెంగీ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
పలువురు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కాకముందే డెంగీ నివారణకు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. వేసవిలో వాడే వాటర్ కూలర్స్ వేసవి ముగిశాక దానిలో నీటిని పూర్తిగా తీసివేయాలన్నారు. మంగళ, శుక్రవారాల్లో డ్రైడే..ఫ్రైడే పాటించాలన్నారు. ఆయా పీహెచ్సీల వైద్యాధికారులు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.