ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పది నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో అందరూ తమ అనుచరగణంతోపాటు కుటుంబ సభ్యులను సైతం రంగంలోకి దించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాడవాడలా.. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. మ్యానిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఇప్పటికే పట్టణాలు, పల్లెలు, మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాయని, ఆ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు మహిళలు హారతులు పట్టి.. పూలు చల్లుతూ.. బొట్టుపెట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు.
బోనకల్లు, అక్టోబర్30: కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ మధిర అసెంబ్లీ అభ్యర్థి లింగాల కమల్రాజును గెలిపించాలని మాజీ జడ్పీటీసీ బానోతు కొండ, బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు కోరారు. బోనకల్లులో బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజు గెలుపు కోరుతూ మ్యానిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గెలుపుతో అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు యార్లగడ్డ చిన్ననరసింహ, మహేశ్వరరావు, మోర్ల నరసింహారావు, శ్రీనివాసరావు, పోటు వెంకటేశ్వర్లు, తోటపల్లి హైమావతి, రమేశ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, అక్టోబర్ 30 : మధిర నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు, నాయకులకు, అధికారులకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజ్ను గెలిపించాలని బీఆర్ఎస్ మండల కార్యదర్శి బొడ్డు వెంకట్రామారావు అన్నారు. బస్వాపురంలో బూత్, గ్రామ కమిటీ నాయకులతో కలిసి సోమవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు. నాగులవంచ గ్రామంలో ఏఎంసీ డైరక్టర్ వంకాయలపాటి వెంకటలచ్చయ్య ఆధ్వర్యంలో శివాలయం, రామాలయంలో పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు కొల్లి బాబు, బొడ్డు శ్రీను, సిలివేరు సైదులు, అంబటి వెంకటి, సైదేశ్వరరావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ, అక్టోబర్ 30 : గోకినేపల్లిలో మండల మాజీ అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, బంక మల్లయ్య, పయ్యావుల వెంకటేశ్వర్లు, శరత్బాబు, రవికాంత్, మెట్టెల క్షత్రయ్య, బొల్లికొండ రామారావు, వెంకటనారాయణ, మీగడ సుధాకర్, నాగరాజు, వంశి, నాగార్జున, సాయి, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, అక్టోబర్ 30: బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు గెలుపు కోరుతూ సోమవారం జమలాపురంలో మధిర ఏఎంసీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరిగి డోర్పోస్టర్లను అంటిస్తూ కారు గుర్తుపై ఓటు వేసి కమల్రాజును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దేవరకొండ శిరీష, శీలం కవిత, అప్పారావు, మూల్పూరి స్వప్న, శ్రీనివాసరావు, శైలజ, పవన్, కిశోర్బాబు, రవి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.