మామిళ్లగూడెం, ఏప్రిల్ 24 : లోక్సభ సాధారణ ఎన్నికలను పురసరించుకుని ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో బుధవారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కలెక్టరేట్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావు నాల్గో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావుకి చెందిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను లకావత్ సైదులు, బచ్చలికూర నాగరాజు, ఈవూరి శ్రీనివాసరెడ్డి, బి.అనూష, డి.చంద్రశేఖర్సింగ్, డి.రాకేష్, మలీదు వెంకటేశ్వర్లులు దాఖలు చేశారు.
సకలజనుల పార్టీ అభ్యర్థిగా పాపిట్ల రాంమూర్తి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా లింగాల రవికుమార్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోట్ల నాగేశ్వరరావు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
బీఎస్పీ అభ్యర్థిగా ఎర్ర కామేశ్వరరావు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జై బీమ్ భారత్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల శ్రీనివాసరావు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా వాసం రామకృష్ణ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎస్కే. అజ్జు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా సోమగాని నరేందర్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా లింగం కృష్ణ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆలిండియా నేషనల్ రక్ష సేన పార్టీ అభ్యర్థిగా లకావత్ నాగేశ్వరరావు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగ సీతారాములుకి చెందిన ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించిన రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రతిజ్ఞ చేయించారు.