ఎర్రుపాలెం, నవంబర్ 16 : ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి మండలంలోని కొత్తగోపవరం, భీమవరం, అయ్యవారిగూడెం, రాజులదేవరపాడు, మామునూరు, లక్ష్మీపురం, చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు, బుచ్చిరెడ్డిపాలెం, నరసింహాపురం, కాచవరం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్కను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేసింది శూన్యమన్నారు. ఇప్పటికే జడ్పీ చైర్మన్గా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేశానన్నారు.
ప్రజలు ఇప్పటికైనా భట్టి విక్రమార్క మాయమాటలు నమ్మి మోసపోకుండా.. వాస్తవాలను గ్రహించి ప్రజల కోసం పనిచేసే తనకే పట్టం కట్టాలని కోరారు. బనిగండ్లపాడులో యన్నం సత్యనారాయణరెడ్డి, నీలం రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వంద కుటుంబాలు, మామునూరులో 5 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి అభ్యర్థి లింగాల కమల్రాజు, కొండబాల గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, నాయకులు అప్పారావు, బాలరాఘవరెడ్డి, శీలం వెంకటరెడ్డి, రామకోటయ్య, కొండేపాటి సాంబశివరావు, చిట్టిబాబు, శ్రీకాంత్రెడ్డి, మూల్పూరి శ్రీనివాసరావు, కృష్ణారావు, కోట శ్రీనివాసరావు, రాధమ్మ, రేణుక, మదన్మోహన్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రవి, భాస్కర్, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, నాగేశ్వరరావు, నరేందర్రెడ్డి, వెంకటేశ్వర్లు, కిషోర్బాబు, సుధీర్, వెంకటనారాయణ, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.