కొణిజర్ల, అక్టోబర్ 11: వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి వైరా నియోజకవర్గంలో విజయ బావుటాను ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో నిర్వహించిన బూత్లెవల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా తన ఇంటికి వచ్చి మాట్లాడవచ్చన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ కార్యకర్తలు, నాయకులను కలుపుకొంటూ పనిచేస్తారని స్పష్టం చేశారు. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వైపు ఆకర్షితులు కావొద్దన్నారు. ఆ పార్టీల నాయకుల మోసపూరిత మాటలు నమ్మొద్దన్నారు.
ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో గెలిచి, ఆ గెలుపును పార్టీ అధినేత కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, పార్టీ మండల అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, జడ్పీటీసీ పోట్ల కవిత, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, బీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, బోడపోతుల బాబు, డేరంగుల బ్రహ్మం, పాముల వెంకటేశ్వర్లు, జడల మల్లేశ్, కిలారు కిరణ్, నరసింహ నాయక్, భిక్షం, బాబు, రామారావు, తాళ్లూరి చిన్నపుల్లయ్య, చల్లగుండ్ల రమేశ్, కాంతమ్మ, నాగేశ్వరరావు, అద్దంకి చిరంజీవి, మూడ్ సురేశ్, స్వప్న, నాగేశ్వరరావు, బాలాజీ, రోషన్, ప్రసాద్, రాందాస్ పాల్గొన్నారు.