మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయ ఆవరణలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర మృత్యుంజయస్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం ఉన్నదని, దానిని కాపాడుకోవాలన్నారు. అందుకోసమే ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసుకోవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పాటు, దాతల తోడ్పాటుతో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, ఎంపీపీ మెండెం లలిత, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, రైతుసమన్వయ సమితి కన్వీనర్ వేణు, సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.