KTR | ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంతోపాటు ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలన్నారు.
ఒక్క అర్హులైన ఓటరు పేరు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఇంటింటికీ వెళ్లి చేపట్టండి. డిజిటల్ రూపంలో అత్యంత సులువుగా పార్టీ సభ్య నమోదు చేపట్టేందుకు ప్రత్యేకంగా యాప్ తెచ్చాం. పదేళ్లు తపస్సులా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తీసుకుంటా. మోడీ ఎంత చెబితే అంతే పంట కొంటామని కాంగ్రెస్ చేతులెత్తేసింది. కాంగ్రెస్ ను త్వరలో కాటికి పంపడమే ఇక మిగిలిందని పిలుపునిచ్చారు కేటీఆర్.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు లింగాల కమల్రాజు, కూరాకుల నాగేశ్వరరావు, దిండిగాల రాజేందర్, ఏనుగుల రాకేశ్ రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి , ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.