ఖమ్మం: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందచేస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పాలెపు విజయలక్ష్మి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అన్నారు.
బతుకమ్మ పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపుతుందన్నారు. మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో అనేక అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు.ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ది పథకాలు అందించడమే పువ్వాడ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకులు సిహెచ్ రవికిరణ్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి, టీఆర్ఎస్ ఖమ్మం నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డెల్లి లెనిన్, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.