ఖమ్మం లీగల్, జూన్ 9: కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కొత్త కోర్టుల ప్రారంభోత్సవానికి గురువారం తిరుపతి వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, ఈసీ సభ్యులు తోటకూరి శ్రీనివాసరావు, కొండపల్లి శ్రీనివాస్, న్యాయవాది తాళ్లూరి దిలీప్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వారు జస్టిస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకసారి ఖమ్మం వచ్చి భద్రాచలం రామయ్యను దర్శించుకొని ఖమ్మం బార్ అసోసియేషన్ను సందర్శించాలని సీజేఐని ఆహ్వానించారు.