రామవరం, సెప్టెంబర్ 20 : సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ & ఎం) ఎం.తిరుమలరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల శాఖాధిపతులు, అధికారులు తమను పరిచయం చేసుకున్నారు. కొత్తగూడెం ఏరియాలోని కొత్తగూడెం జిఎం కార్యాలయం నందు డైరెక్టర్ (ఈ & ఎం), ఎం. తిరుమల రావు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియాలోని (ఈ & ఎం) విభాగంలో అధికారులు, సూపర్వైజర్లు ఎంతమంది పనిచేస్తున్నారు, ఇంకా ఎంతమంది వేకెన్సీ ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం జి.వి.కోటి రెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, డీజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డీజీఎం (ఐఈడి) ఎన్.యోహాన్, డిజిఎం(ఈ&ఎం) ఏరియా వర్క్ షాప్ జె.క్రిస్టోఫర్, కొత్తగూడెం ఏరియా ఇతర విభాగాల అధిపతులు, (ఈ&ఎం) అధికారులు పాల్గొన్నారు.