రామవరం ఏప్రిల్ 10 : కార్మిక వర్గంకోసం, పేద ప్రజలకోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకోసం నేటితరం కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సెంటర్లో పునఃనిర్మించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దేవూరి శేషగిరిరావు విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు బుధవారం రాత్రి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బందెల నర్సయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలుత నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. సింగరేణి ప్రధాన కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన శేషగిరిరావు నాడు బ్రిటీష్ తెల్లదొరల దోపిడికి వ్యతిరేకంగా పోరాటాలకు శ్రీకారం చుట్టారన్నారు. బొగ్గు గనుల్లో మహిళలు, పిల్లలతో పని చేయించే విధానాన్ని వ్యతిరేకించిన తొలితరం ఉద్యమకారుడు శేషగిరిరావు అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఈ ప్రాంతంలో బ్రిటీష్ దోరల నిరంకుష పాలనకు, రజాకార్ల దొపిడి వ్యవస్థ నిర్మూళన కోసం పోరాడిన ధీశాలి శేషగిరిరావు అని, అజ్ఞాత దళానికి నాయకత్వం వహించి పోరాడన్నారు. సింగరేణి, ప్రభుత్వ, ప్రైవేట్రంగ పరిశ్రమల్లో 8 గంటల పని విధానం అమలు ఆయన పోరాట ఫలితమేనన్నారు. కార్మికవర్గం, ప్రజల కోసం పోరాడిన శేషగిరావుతోపాటు ఆయన సహచరులు రంగయ్య, పాపయ్యను అప్పటి రజాకార్లు బూర్గంపాడు ప్రాంతంలో కాల్చి చంపారన్నారు.
CPI : అమరుల త్యాగాలను స్మరించుకోవాలి : భాగం హేమంతరావు
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.అయోధ్య, వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు ఆకర్షితులైన రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన బందెల నర్సయ్య సీపీఐ, ఏఐటీయూసీలో రాష్ట్ర స్థాయికి ఎదిగారని, కొత్తగూడెం ప్రాంతాల్లో పార్టీ, యూనియన్ విస్తరణకు ఎనలేని కృషిచేశారన్నారు. గని కార్మిక ఉద్యమాలకు, అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి ఎన్నో విజయాలు సాధించినట్లు తెలిపారు. సి హెచ్ పి ఎస్ జిల్లా నేతగా, రాష్ట్ర నాయకుడిగా దళిత వర్గ సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. అలాంటి నేతను కొత్తగూడెం ప్రాంతం కోల్పోవడం బాధాకరమని, ఆయన ఆశయాల సాధనకు పార్టీ, ప్రజాసంఘాల నాయకులు కృషి చేయాలన్నారు.
వాసిరెడ్డి మురళి, గనిగళ్ల వీరస్వామి, తోట రాజు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, తాటి వెంకటేశ్వర్లు, డి.వెంకన్న, సరెడ్డి పుల్లారెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్ రావు, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్రకుమార్, జిల్లా సమితి సభ్యులు ధమాలపాటి శేషయ్య, వంగ వెంకట్, వట్టికొండ మల్లికార్జునరావు, కంచర్ల జమలయ్య, రమణ మూర్తి, భూక్యా శ్రీను, భూక్యా డస్రు, పోలుమూరిశ్రీనివాస్, లక్ష్మిపత్తి, జక్కుల రాములు, కుమారి హనుమత్ రావు, బరిగల సంపూర్ణ, ఫహీమ్, రత్న కుమారి, మునిగడపు వెంకటేశ్వర్లు, రామచందర్, వెంకటరమణ, మద్దెల శివకుమార్, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు, బందెల నరసయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీ నిర్ణయం తీసుకోక ముందునుండే తెలంగాణ ఉద్యమంలో బందెల నరసయ్య చురుగ్గా పాల్గొన్న వాడని, రుద్రంపూర్ జేఏసీతో ఆయనకున్న అనుబంధాన్ని తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. బందెల నరసయ్య పార్టీలకు అతీతంగా అందరితో ఉండేవాడని అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంకు బాపన అనుదీప్, జాగృతి నాయకులు బండారి సాగర్, ఎవరు యాకయ్య, ఆముదాల అనిల్, బావు సతీశ్, ఉమర్, ఫయాజ్ పాల్గొన్నారు.