పర్ణశాల: పర్ణశాల ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీతమ్మవాగు పెరిగి నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. ఈకారణంగా భక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకుని ఆ ప్రాంతం వద్దకు వెళ్లకుండానే వెళ్లిపోతున్నారు. గోదావరి వరద పెరగడంతో ఎవరినీ నదిలోకి వెళ్లనీయకుండా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు.