రుద్రంపూర్, మే 20 : డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత మార్చి 20న రాత్రి 11:40 గంటల సమయంలో కట్ట శ్రీనివాస్, నేరేడుమల్లి నవదీప్ కలిసి కృషి విజ్ఞాన కేంద్రం వెళ్లే దారిలోని కల్వర్టు వద్ద బొల్లి కార్తీక్తో డబ్బుల విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరూ కర్రలతో బొల్లి కార్తీక్పై దాడి చేయగా అతడి ముక్కుకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై బాధితుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కట్ట శ్రీనివాస్, నేరేడుమల్లి నవదీప్లతో పాటు ఫోన్లో దూషించిన నేరేడుమల్లి సందీప్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు కట్ట శ్రీనివాస్, నేరేడుమల్లి నవదీప్లను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపినట్లు సీఐ వెల్లడించారు.