తూప్రాన్,ఆగస్టు 9: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
మున్సిపాల్ చైర్పర్సన్ బొంది రజనితో పాటు మహిళా కౌన్సిలర్లు,మహిళలతో కలిసి మున్సి పాల్ కార్యాలయం నుంచి అమ్మవారి దేవాల యం వరకు వెళ్లి బోనాలు సమర్పించారు. పలువురు భక్తులు,ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.