హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కోట్లు వెచ్చించి నిర్మించిన ఐటీ టవర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆవేదన వ్యక్తంచేశారు. ఐటీ టవర్లు దయనీయంగా ఉన్నాయని అన్నారు. సిద్దిపేట ఐటీ టవర్ను తాను సందర్శించానని.. అక్కడ వడ్లు ఎండబోశారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఇందుకోసమేనా.. ఐటీ టవర్లు కట్టింది? అంటూ నిలదీశారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు డీలా పడ్డాయని.. 84 శాతం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవని, ఉద్యోగాల కల్పనకు సర్కార్ ప్రాధాన్యమివ్వాలని సూచించారు.