బీరుట్ : దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లాకు చెందిన సొరంగాల నెట్వర్క్ను ఇజ్రాయెట్ ధ్వంసం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ నెట్వర్క్ ఒక మైలు(2 కి.మీ) కంటే ఎక్కువ దూరం విస్తరించి ఉందని, ఇందులో డజన్ల కొద్దీ రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో పాటు మందుపాతరలు, పేలుడు పరికరాలు, నివాస గదులు ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) తెలిపాయి.
గురువారం అలీ అల్ తాహెర్ రిడ్జ్ వద్ద ఇజ్రాయెల్ సైన్యం భారీ పేలుడు జరిపినట్లు లెబనాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ ఎన్ఎన్ఏ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడిని ధృవీకరించారు. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు.